Homeజాతీయంపార్టీ వ్యతిరేక చర్యలపై ఆర్జేడీ వేటు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు!

పార్టీ వ్యతిరేక చర్యలపై ఆర్జేడీ వేటు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు!

- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్‌లో రాజకీయం వేడెక్కింది.
ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కీలక నిర్ణయం ప్రకటించింది.పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం 27 మంది నేతలను ఆర్జేడీ బహిష్కరించింది.ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు మంగని లాల్ మండల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేసిన కారణంగా వారిని ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.మహాగఠ్‌బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, పార్టీకి నష్టం కలిగించే చర్యల్లో పాల్గొనడం వంటివే ఈ నిర్ణయానికి కారణమని ఆర్జేడీ స్పష్టం చేసింది.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ఎమ్మెల్యే పవన్ యాదవ్
బహిష్కరణకు గురైన 27 మంది నేతల్లో ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలైన చోటే లాల్‌రాయ్,మహ్మద్ కమ్రాన్ ఉన్నారు.అదనంగా,నలుగురు మాజీ ఎమ్మెల్యేలు,ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని పార్టీ పేర్కొంది.
ఇక మరోవైపు, భారతీయ జనతా పార్టీ (దీజీూ)కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంది.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరుగురు నాయకులను భాజపా బహిష్కరించింది.
ఎన్డీయే అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.భాజపా చర్యల జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్యే పవన్ యాదవ్ కూడా ఉన్నారు.
పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు