Homeఅంతర్జాతీయంయుద్ధానికి తుది గడువు లేదు.. ఫలితాలకోసం చర్చలు కొనసాగుతున్నాయి

యుద్ధానికి తుది గడువు లేదు.. ఫలితాలకోసం చర్చలు కొనసాగుతున్నాయి

- Advertisement -

: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ

దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు.ఫ్లోరిడా ఎస్టేట్స్‌లోని నివాసానికి చేరుకున్న జెలెన్స్కీని ట్రంప్ స్వాగతించారు.ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన వ్యాఖ్యల్లో, ట్రంప్ యుద్ధానికి తుది గడువు ఏదీ లేనప్పటికీ, శాంతి సాధించడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో కూడా చర్చించినట్లు తెలిపారు.పుతిన్‌తో జరిగిన భేటీ ఫలితాలపై దృష్టి సారిస్తున్నట్లు, ఫలితాలు సాధించడానికి చర్చలు జరుగుతున్నట్లు ఆయన సొంత సామాజిక మాధ్యమం ఁట్రూత్ సోషల్ఁలో వెల్లడించారు.

8 యుద్ధాల ఆపే ప్రయత్నాలు చేశాం
ట్రంప్‌ మాట్లాడుతూ,ఁరష్యా, ఉక్రెయిన్‌ శాంతిని కోరుకుంటున్నాయి. జెలెన్స్కీతో నా సమావేశంపై పుతిన్‌ చిత్తశుద్ధిగా ఉన్నారు. యుద్ధానికి తుది గడువు లేదు. ప్రస్తుత పరిస్థితులలో పుతిన్, జెలెన్స్కీ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 8 యుద్ధాల ఆపే ప్రయత్నాలు చేశాం. ఫ్లోరిడాలో ఈ సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్‌ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తున్నాం. ఇవి చివరి దశలో ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలిఁ అన్నారు.

20-సూత్రాల ప్రణాళికపై చర్చ
జెలెన్స్కీ సమావేశం సందర్భంగా, ఉక్రెయిన్‌ భద్రతా హామీల విషయంలో ట్రంప్‌తో చర్చించనున్నట్టు తెలిపారు.ముఖ్యంగా 20-సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపు 90 శాతం సిద్ధమైందని తెలిపారు.ఈ సమావేశంలో ఉక్రెయిన్‌, అమెరికా మాత్రమే కాకుండా ఐరోపా దేశాలూ పాల్గొనాలని ఆశిస్తున్నప్పటికీ, తక్కువ సమయంతో అది సాధ్యంకాకపోవచ్చని జెలెన్స్కీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు