Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఉత్తమ ఆర్డీవోగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న కోదండరామిరెడ్డి

విశాలాంధ్ర -రాజంపేట: 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజంపేట ఆర్డిఓ కోదండరామిరెడ్డి జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఇన్చార్జ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఆర్డీవో గా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. రాజంపేట ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులను ఆదేశించడం జరుగుతుంది. జగనన్న ఇళ్ల నిర్మాణంలోనూ గృహాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాజంపేటలో కనీవిని ఎరగని రీతిలో ఆజాది కా అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకే పెద్దపెట వేస్తున్నారు. ఈ ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష, జాయింట్ కలెక్టర్ అన్సరియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమక్షంలో అందుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img