Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్

కొయ్యలగూడెం: అభివృద్ధి చేయంగా ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కుంతల గూడెం గ్రామంలో మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు బాలరాజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వ అధికారుల పనితీరు పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాసమస్యలు ఉంటే ప్రభుత్వ అధికారులు తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండలం ఎంపీపీ గంజి మల రామారావు, మంతెన సోమరాజు, పశ్చిమ డెల్టా బోర్డ్ చైర్మన్ గంజి మలదేవి, రాజవరం గ్రామపంచాయతీ సర్పంచ్ ఏలేటి చిన్నతుక్కయ్య, నూకల రాము,బాలస్వామి, సుధాకర్, శ్రీను,గొడ్డటి నాగేశ్వరరావు, తోట జయ బాబు, సుబ్బారాయుడు, సురేష్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఉదయ్ కుమార్, పంచాయతీరాజ్ డిఇ సీతయ్య, ఏ పి ఎం సుబ్రహ్మణ్యం, పలు ప్రభుత్వ అధికారులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img