Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చెత్తసంపద రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగారావు

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో బాగంగా ప్రభుత్వం అందజేసిన 13చెత్తసంపద రిక్షాలను ఎమ్మెల్యే అలజింగి జోగారావు చేతులమీదుగా మంగళవారంనాడు క్లిప్ మిత్రలకు అందజేసారు. గ్రామాల్లో స్వచ్చ భారత్ కార్యక్రమంను చక్కగా నిర్వహించి గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా తీర్చి దిద్ది ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బలగ శ్రీరాములు నాయుడు,జడ్పీటీసీ బాబ్జి, ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్ది వర్మ, మండల వైఎస్ఆర్సీపీఅధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, పోల ఈశ్వరనారాయణ,రత్నాకర్, సవరపు రామారావు, ఎంపీటీసీలు కిరణ్,సూర్యనారాయణ గాజాపు శ్రీనివాసరావు తదితర నాయకులు, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img