విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆర్ట్స్ కళాశాల హిందీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం “జాతీయ పత్రికా దినోత్సవం” ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆశావాది శశాంక మౌళి ప్రసంగిస్తూ “పత్రికలు ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటివి. నార్ల వారి మాట ప్రకారం ఒక్క పత్రిక మనకు ఉంటే పదివేల సైన్యం మన వెంట ఉన్నట్టే. పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి ఒక మూల స్తంభం లాంటివి అని పేర్కొన్నారు. ప్రజల తరుపున గొంతువిప్పే పత్రికలు పది కాలాల పాటు నిలబడతాయి అన్నారు. పత్రికా స్వేచ్ఛను రకరకాల చట్టాలు, నియమ-నిబంధనల పేరుతో కట్టడి చేయాలని చూసే ఏ ప్రభుత్వాలైనా ఎక్కువ కాలం మనజాలవు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ శాఖాధ్యక్షులు ఎం.వి.ఎల్. నరసింహం, హిందీ ఉపన్యాసకులు సోమశేఖర్ తమ ప్రసంగాలలో పత్రికా పఠనం యొక్క ఆవశ్యకతను విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు.