Homeజాతీయంకాక్రోచ్ పార్టీకి పోటీగా "ఇష్క్ కరో పార్టీ"..!

కాక్రోచ్ పార్టీకి పోటీగా “ఇష్క్ కరో పార్టీ”..!

- Advertisement -

మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాట్జూ సంచలన నిర్ణయం

దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” (సీజేపీ) నేపథ్యంలో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. “ఇష్క్ కరో పార్టీ” (ఐకేపీ) పేరుతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పార్టీ పేరు కేవలం సరదా కోసం పెట్టలేదని, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం, చిన్నారుల్లో పోషకాహార లోపం వంటి కీలక సమస్యలపై ప్రజలను ఏకం చేసి పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యమని కాట్జూ స్పష్టం చేశారు.

ప్రేమ కాదు.. ఐక్యతకు ప్రతీక
ఇష్క్ కరో పార్టీ అనే పేరుపై వస్తున్న చర్చలకు స్పందించిన కాట్జూ, ఇది ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన పార్టీ కాదని సోషల్ మీడియా వేదికగా వివరించారు. సమాజంలోని భిన్న వర్గాలు, భిన్న అభిప్రాయాలున్న ప్రజలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలనే భావనతో ఈ పేరును ఎంపిక చేసినట్లు చెప్పారు. దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజల మధ్య సామరస్యం, ఐక్యత పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తమ పార్టీలో చేరాలని బహిరంగంగా ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల నీట్ పరీక్షల వివాదంపై జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన ఃకాక్రోచ్ జనతా పార్టీః వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విధానాలను కాట్జూ తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మంత్రి రాజీనామా చేస్తే మరో మంత్రి వస్తారని, దాంతో వ్యవస్థలో పెద్దగా మార్పులు చోటుచేసుకోవని పేర్కొంటూ ఆ ఉద్యమ తీరును ప్రశ్నించారు.

కాట్జూ విమర్శలు చేస్తున్నప్పటికీ, డిజిటల్ వేదికగా ఎదుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి ప్రతిపక్షాల సమావేశంలో కూడా ఈ పార్టీ కార్యకలాపాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ డిజిటల్ ఉద్యమం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం భిన్నంగా స్పందించారు.యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహానికి ఈ ఉద్యమం ప్రతిబింబంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.యువతతో కలిసి పనిచేస్తే ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉంటుందని కూడా సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు