Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా నామాల నాగార్జున ఎంపిక

విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 2, 3వ తేదీలలో పుట్టపర్తిలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా మహాసభలు నిర్వహించిన సందర్భంలో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షునిగా ధర్మవరం పట్టణానికి చెందిన నామాల నాగార్జునను తిరిగి నాలుగవసారి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అధ్యయన పోరాటం అనే నినాదంతో విద్యార్థులపై క్షేత్రస్థాయిలో, అనేక ఉద్యమాలు చేస్తున్న సందర్భంలోనే మరోసారి తనకు అవకాశం కల్పించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. నూతన జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులపై రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై తన వంతుగా తాను పోరాటం చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img