Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలనగా మారింది

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో జగన్ పరిపాలన తుగ్లక్ పరిపాలనగా మారిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని 31 వార్డులో మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జగన్ పరిపాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో నిత్యవసర వస్తువులు ఆకాశాన్నంటాయని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా కోతకోసారని మండిపడ్డారు. సామాన్యులపై అధిక భారాన్ని వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్ .కృష్ణారెడ్డి ,టిడిపి యువ నాయకులు అనిల్ కుమార్ గౌడ్,యువత పట్టణ అధ్యక్షులు వాల్మికి రాము,బందా నవాజ్ ,కురబ శివన్న,టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సురేష్,రంజాతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img