Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి..

రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి..

శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు సహాయకులకు మొత్తం 380 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ నామా ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాతల సహాయ సహకారాలతోనే ఈ నారాయణ సేవా కార్యక్రమాన్ని (అన్నదాన సేవ) చేపడుతున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి, ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి మానవతా విలువలు పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున సూపర్డెంట్ మాధవి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని, సెల్ నెంబర్ 9966047044 గాని 9030444065 గాని సంప్రదించాలన్నరూ. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు