Homeఅంతర్జాతీయండాలర్‌పై రూపాయి పంజా.. ఏకంగా 47 పైసలు లాభం!

డాలర్‌పై రూపాయి పంజా.. ఏకంగా 47 పైసలు లాభం!

- Advertisement -

94.26 వద్ద ట్రేడింగ్ ప్రారంభం
భారీగా తరలివచ్చిన విదేశీ నిధులే ప్రధాన కారణం
ఆర్‌బీఐ అంచనాలను మించి 136 బిలియన్ డాలర్ల సమీకరణ

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ నేడు భారీగా బలపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూపాయి ఏకంగా 47 పైసలు లాభపడి 94.26 వద్ద నిలిచింది. నిన్న‌ మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి విలువ 94.97గా ఉన్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన ప్రత్యేక పథకాల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ నిధులు తరలిరావడమే రూపాయి బలోపేతానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విదేశీ కరెన్సీ సమీకరణ పథకాల ద్వారా భారత్ ఏకంగా 136.38 బిలియన్ డాలర్లను ఆకర్షించినట్లు ఆర్‌బీఐ నివేదించింది. మార్కెట్ వర్గాలు సుమారు 100 బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేయగా, అంతకుమించి నిధులు రావడం రూపాయికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్ఆర్) డిపాజిట్ల రూపంలో రాగా, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా 3.89 బిలియన్ డాలర్లు, ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ ద్వారా 5.26 బిలియన్ డాలర్లు సమకూరాయి. ఇదే సమయంలో ఇతర ఆసియా కరెన్సీలు కూడా పుంజుకోవడం, యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.50 స్థాయికి దిగువకు పడిపోవడం వంటి అంశాలు కూడా రూపాయికి కలిసొచ్చాయి. జపాన్ యెన్ బలపడటం డాలర్‌పై ఒత్తిడి పెంచింది. ఈ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలో, రాబోయే అమెరికా ఆర్థిక డేటా, ఫెడ్ అధికారుల ప్రకటనలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. అంచనాలకు మించి వచ్చిన విదేశీ నిధులు, ఆర్‌బీఐ మద్దతు, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రూపాయి స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు