గురుగ్రామ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) ఈ రోజు, 2030 నాటికి తన కార్యనిర్వాహక కార్యబలంలో మహిళల ప్రాతినిధ్యాన్ని 20%కి పెంచాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. విభిన్నమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభావంతుల సమూహాన్ని నిర్మించే కంపెనీ ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. 4,000 మందికి పైగా ఉద్యోగులున్న హెచ్ఎమ్ఐఎల్ మొత్తం కార్యనిర్వాహక కార్యబలంలో ప్రస్తుతం మహిళలు 8% కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. అదే సమయంలో, 2026లో నియమించబడిన యువ ప్రతిభావంతులలో (మేనేజ్మెంట్ ట్రైనీలు & ఇంజనీర్ ట్రైనీలు) సుమారు 45% మంది మహిళలే ఉన్నారు, ఇది మారుతున్న ప్రతిభావంతుల ధోరణులను స్పష్టం చేస్తోంది. సమ్మిళిత కార్యాలయాలు ఆవిష్కరణ, సహకారం, దీర్ఘకాలిక వ్యాపార వృద్ధిని బలోపేతం చేస్తాయనే హెచ్ఎమ్ఐఎల్ నమ్మకాన్ని ఈ లక్ష్యం ప్రతిబింబిస్తుంది. తయారీ, ఇంజనీరింగ్, ఆర్&డి, అమ్మకాలు, సేవ, కార్పొరేట్ విధులు, నాయకత్వ పాత్రలలో మహిళల భాగస్వామ్యం పెరగడాన్ని హెచ్ఎమ్ఐఎల్ గమనిస్తోంది. వారు తీసుకువస్తున్న విభిన్న దృక్కోణాలు, నైపుణ్యాలు సంస్థను సుసంపన్నం చేయడంతో పాటు ఆవిష్కరణ, సహకారం, దీర్ఘకాలిక వ్యాపార వృద్ధికి దోహదం చేస్తున్నాయని హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ తరుణ్ గార్గ్ అన్నారు.


