Homeజాతీయంవందేమాతరం పూర్తి గేయం ఆలపించిన అబ్దుల్లాలు.. కాంగ్రెస్ అభ్యంతరం

వందేమాతరం పూర్తి గేయం ఆలపించిన అబ్దుల్లాలు.. కాంగ్రెస్ అభ్యంతరం

- Advertisement -

శ్రీనగర్‌లో నిర్వహించిన జమ్ముకశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం వందేమాతరం వివాదానికి వేదికైంది.షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ గేయమైన వందేమాతరంను మొత్తం ఆరు చరణాలతో ఆలపించారు
ఈ సమయంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గౌరవ సూచకంగా గేయం పూర్తయ్యే వరకు నిలబడ్డారు.దీంతో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు మరోసారి చర్చకు వచ్చాయి.

కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలే.అయితే వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించిన అంశంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించారు.స్వాతంత్ర్య సమరయోధుల ఆలోచనలు, 1937లో కాంగ్రెస్ తీసుకున్న తీర్మానం ప్రకారం వందేమాతరంఃలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని ఆయన పేర్కొన్నారు.పూర్తి గేయం ఆలపించడం వల్ల దేశంలోని లౌకిక, సమగ్ర భావనకు విఘాతం కలిగే అవకాశం ఉందని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల నిర్ణయాలను గౌరవించాలని కాంగ్రెస్ కోరింది.

ఎన్సీ ఘాటు స్పందన
వందేమాతరాన్ని తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలని, ఈ పాటను రాజకీయ అంశంగా మార్చకుండా దేశ లౌకికత్వాన్ని కాపాడాలని తమ భాగస్వామ్య పక్షాలకు సూచించింది.వేణుగోపాల్ వ్యాఖ్యలకు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఘాటుగా స్పందించింది.ఃఇండియాః కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఎప్పుడు పాట పాడాలి,ఎంతవరకు పాడాలి అనే విషయాల్లో తమపై ఎలాంటి షరతులు విధించలేరని ఎన్సీ నేత బషీర్ అహ్మద్ స్పష్టం చేశారు.వేణుగోపాల్‌కు తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే ఆ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దే అధికారం లేదని ఆయన అన్నారు.పాటను ఎప్పుడు, ఎంతసేపు పాడాలన్నది ప్రజల నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజలపై ఏ విషయాన్నీ బలవంతంగా రుద్దడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే..
ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు పూర్తి గేయం ముగిసే వరకు నిలబడి గౌరవించడంపై కూడా బషీర్ అహ్మద్ వివరణ ఇచ్చారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇద్దరూ వ్యవహరించారని తెలిపారు.సుమారు మూడు నిమిషాల పాటు సాగిన పూర్తి ఃవందేమాతరంః గేయాలాపన పూర్తయ్యే వరకు వారు నిలబడి గౌరవం ప్రకటించారని చెప్పారు.దీంతో ఃవందేమాతరంః గేయం విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి.ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య తాజా వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు