పంద్రాగస్టు వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు. పాస్లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందన్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.