Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాహుల్‌పై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ దన్వే తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శనివారం జరిగిన జన ఆశీర్వాదయాత్రలో దన్వే మాట్లాడుతూ,రాహుల్‌ ఆంబోతువంటివారని, ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని అన్నారు. ఆయన అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారని, అయినా ఏ ప్రయోజనం ఉండదని అన్నారు. తాను ఇరవయ్యేళ్ళ నుంచి లోక్‌సభలో ఉన్నానని, రాహుల్‌ పనితీరును గమనించానని అన్నారు. కాగా కేంద్ర మంత్రి దన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img