Saturday, June 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టిసిలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్న హెచ్ఎంల పైన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టిసిలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్న హెచ్ఎంల పైన చర్యలు తీసుకోవాలి

పి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మొండి నందకిషోర్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ లపై వెనివెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయ అధికారిని సుజాతకు పిఎస్యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మొండి నందకిషోర్ తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. అసలు పేదవాళ్లే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని వారు గుర్తు చేశారు. అలాంటి విద్యార్థులపై డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 400 నుంచి 700 వరకు డబ్బులు ఇస్తేనే మీకు టీసీలు ఇస్తామని పాఠశాల హెచ్ఎంలు తెలపడం దారుణమని తెలిపారు. పాఠశాల అభివృద్ధి చేయడానికి ఈ డబ్బులు వసూలు చేస్తున్నామని హెడ్మాస్టర్లు చెబుతున్నారని, మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన విషయం మరిచారా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీసీలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. లేనిపక్షంలో టిసిలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్న పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు అశోక్, గుణవరన్,ప్రవీణ్,రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు