Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు రెడీ..

ఆపరేషన్‌ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు రెడీ..

- Advertisement -

ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు!
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు సంబంధించి త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ప్రశాంత పరిస్థితులు శాశ్వతమైనవి కావని, అవి కేవలం తాత్కాలికమేనని పేర్కొన్నారు. శత్రు దేశాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు జనరల్ ద్వివేది వెల్లడించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో యుద్ధరంగంలోని ప్రతి కదలిక స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ప్రజల పాత్ర కూడా కీలకమే
అందువల్ల కేవలం సైనికుల భద్రత మాత్రమే కాకుండా పౌరుల రక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయని వివరించారు. అదేవిధంగా సమాచార యుద్ధంలో ప్రజల పాత్ర కూడా అత్యంత కీలకమని జనరల్ ద్వివేది అభిప్రాయపడ్డారు. దేశం విజయం సాధించాలంటే ప్రజల మద్దతు తప్పనిసరిగా అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా నిలబడినప్పుడే శత్రువుపై సమర్థవంతంగా విజయం సాధించగలమని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు