Friday, May 9, 2025
Homeఅంతర్జాతీయంభారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో..బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ వాయిదా

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో..బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ వాయిదా

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌ లీగ్‌ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్‌లున్నాయి. లఖ్‌నవూ, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతాకారణాలరీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. పరిస్థితిని బట్టి టోర్నమెంట్‌ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు