Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపల్లకి ఉత్సవములో ఊరేగిన చెన్నకేశవుడు..

పల్లకి ఉత్సవములో ఊరేగిన చెన్నకేశవుడు..

- Advertisement -

ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు 5వ రోజు దాతలు, భక్తాదులు, ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయంపల్లకి ఉత్సవంలో స్వామివారు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. తొలుత అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు ,చక్రధర్ లు వేదమంత్రాలు ,మంగళ వాయిద్యాలయం ప్రత్యేక అర్చనలు, పూజలు చక్కటి అలంకరణ గావించారు. వాహనానికి ఉభయ దాతలుగా వ్యవహరించిన వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి వారిని చైర్మన్ ఘనంగా శాలువాతో సత్కరించారు. తదుపరి పట్టణ పురవీధుల గుండా ప్రత్యేకమైన వాహనంలో స్వామివారు ప్రజల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు పట్టణ పుర ప్రముఖులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు