విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన కోదండ రామాలయ సభ్యులు అన్నం వెంకటనారాయణ మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు విశ్వదీప సేవా సంఘం వారు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రిట్రోల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్, విజయ్ భాస్కర్ రెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు నేత్రాలను సేకరించారు. నేత్రానికి సహకరించిన కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పి. చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు సురేష్ ,ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి తోపాటు సుబ్రహ్మణ్యం, జుజారు రఘు, కేశవరెడ్డి, ధనుంజయ, మాధవ, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానం చేసిన వృద్ధుడు.. విశ్వదీప సేవా సంఘం
RELATED ARTICLES