Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇసుక అక్రమ రవాణాను అధికారులు అరికట్టండి.. ఆర్డీవో మహేష్

ఇసుక అక్రమ రవాణాను అధికారులు అరికట్టండి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను సంబంధిత అధికారులు తప్పక అరికట్టాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, గనుల అధికారులకు సమావేశాన్ని ఆర్డిఓ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అక్రమంగా ఇసుక రవాణా తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. మండల స్థాయి సిబ్బందికి అక్రమ రవాణా నివారణ చర్యల అమలులో తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. అక్రమ రవాణా జరిగినట్లు రుజువైతే రవాణా చేయు వ్యక్తులు వాహనములను సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇసుక రవాణా పర్యవేక్షక ఇన్చార్జులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు