Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు..

డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు..

లాయర్ బాలసుందరి, ఎం ఎల్ ఎస్ ఏ లక్ష్మీదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు జడ్జిల ఆదేశాల మేరకు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులను లాయర్ బాలసుందరి, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని, అట్లు పాటించని యెడల కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోబడును అని తెలిపారు. కార్మికుల హక్కులు, ఇన్సూరెన్స్లు, ఈస్ట్రన్ కార్డ్స్, లేబర్ ఆక్ట్ ,ఉచిత న్యాయ సహాయం, మండల న్యాయ సేవా కమిటీ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ వారు న్యాయ సహాయమును అందిస్తారని తెలిపారు. కానిస్టేబుల్ శివానంద మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవని తెలిపారు. కావున డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు