ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు 9వ రోజు దాతలు, భక్తాదులు, ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం వసంతోత్సవం, మధ్యాహ్నం చక్రస్నానం, సాయంత్రం హంస వాహనం రూపాలలో భక్తులకు చెన్నకేశవ స్వామి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు పట్టణ పుర ప్రముఖులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఒకేరోజు మూడు రూపాలలో దర్శనమిచ్చిన చెన్నకేశవుడు
RELATED ARTICLES