Tuesday, July 15, 2025
Homeజాతీయంసీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

12వ తరగతి ఫలితాలను సెట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం 12వ తరగతిలో 91 శాతం మంది బాలికలుపాసైనట్లు వెల్లడించారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ కావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ మంది పాసైనట్లు బోర్డు వెల్లడించింది. విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురంలో 99.32, చెన్నైలో 97.39 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బెంగళూరులో 95.95, దిల్లీ వెస్ట్‌లో 95.37, దిల్లీ ఈస్ట్‌లో 95.06 శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 79.53 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది. ఫలితాలను cbseresults.nic.in  వెబ్ సైట్​లో చూసుకోవచ్చు.

బాలికలదే పైచేయి
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో 93.66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలదే పైచేయి సాధించారు. గతేడాదితో పోలిస్తే 0.06 శాతం అధిక ఉత్తీర్ణత పొందారని అధికారులు వెల్లడించారు. పదో తరగతి ఫలితాల్లోనూ విజయవాడ రీజియన్ అదరగొట్టింది. 99.79 శాతంతో విజయవాడతో పాటు తిరువనంతపురం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు 98.9, చెన్నై 98.71, పుణె 96.54 శాతం ఉన్నాయి.
పరీక్షల కోసం సీబీఎస్ఈ భారత్​తో పాటు విదేశాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భారత్​లో 7,842 కేంద్రాలు, విదేశాల్లో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలను బోర్డు చాలా పకడ్బందీగా నిర్వహించింది. రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాం ధరించాలని, ప్రైవేట్ అభ్యర్థులు మరోక రంగు దుస్తులను ధరించాలని పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా రోజుల్లో విద్యార్థుల రాకపోకలు పెరిగినందున, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, CISF భాగస్వామ్యంతో ప్రత్యేక సౌకర్యాల చర్యలను తీసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు