Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన చెస్ టోర్నమెంట్ తరగతులు క్యాంపు కోచ్.. బి. శివకృష్ణ

ముగిసిన చెస్ టోర్నమెంట్ తరగతులు క్యాంపు కోచ్.. బి. శివకృష్ణ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో గత నెల రోజులుగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది. చివరి రోజున చెస్ టోర్నమెంట్ ముగియడం జరిగిందని క్యాంపు కోచ్- బి. శివకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ముగింపు చెస్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా కళాజ్యోతి అధ్యక్షులు నారాయణప్ప కార్యదర్శి రామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ పాల్గొనడం జరిగిందన్నారు. ఈ ఉచిత చదరంగం శిక్షణ శిబిరానికి దాదాపు 200 మంది పాల్గొనగా, చివరి రోజు 85 మంది క్రీడాకారులు టోర్నమెంట్ నందు తమ ప్రతిభను చాటడం జరిగిందన్నారు. వీరందరికీ కళాజ్యోతి పాలకవర్గం నుంచి బహుమతులను అందజేయడం జరిగిందన్నారు. ఈ చదరంగం శిక్షణకు గోరంట్ల, పుట్టపర్తి , తుంపర్తి, నిమ్మలకుంట నుండి శిక్షణకు హాజరు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆది రక్త కుమార్ కిషోర్ కుమార్ సింగనమల రామకృష్ణ.. కళా జ్యోతి ఉపాధ్యక్షులు, లయన్స్ క్లబ్ సెక్రటరీ, చదరంగం శిక్షకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు