విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయస్థాయి జూడో పోటీలకు ధర్మవరం మండల పరిధిలోని చికిచర్ల గ్రామములోని ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న లాస్య రెడ్డి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పిడి.ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 నుండి 17వ తేదీ వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీల్లో లాస్య రెడ్డి అనే విద్యార్థిని 48 కేజీల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడం జరిగిందన్నారు. అనంతరం ఈ విద్యార్థిని జాతీయ పోటీలకు అర్హత సాధించడం జరిగిందన్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలు ఈనెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్ లో జరిగే జూనియర్ జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా అత్యంత ఆసక్తి చూపించడం జరుగుతోందని తెలిపారు.ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పిడి, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు లాస్య రెడ్డికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయస్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని లాస్య రెడ్డి ఎంపిక
RELATED ARTICLES