Monday, June 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంప్యూటర్ వినియోగం -కంటిపట్ల జాగ్రత్తలు తప్పనిసరి..

కంప్యూటర్ వినియోగం -కంటిపట్ల జాగ్రత్తలు తప్పనిసరి..

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి- డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర -ధర్మవరం;; కంప్యూటర్ వినియోగంపై, విద్యార్థులు, వినియోగించి వారు తప్పనిసరిగా సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటికి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సాంకేతికంగా అభివృద్ధి చెంది చాలామంది జీవితాలలో కంప్యూటర్ వినియోగం అంతర్భాగం అయిందని, దీర్ఘకాలము ఏకధాటిగా వినియోగిస్తే కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అలా కాకూడదు అంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని కంటిని కాపాడుకోవాలని తెలిపారు. కళ్ళు పొడిబారుట, కంటినొప్పి, తలనొప్పి, కళ్ళు ఎర్రబడడం, నీరు కారడం, వెలుగును చూడలేకపోవడం లాంటివి కంటికి కలిగే ఇబ్బందులు అని తెలిపారు. ఏకధాటిగా కంప్యూటర్ చూడటం వలన కంటి రెప్పలు ఆర్పడం తగ్గిపోతుందని, తద్వారా కన్నీటి ప్రవాహము తగ్గి, కంటి తడి ఆరిపోతుందని కళ్ళు పొడి వారి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అందుకే కంప్యూటర్ యొక్క స్క్రీన్ కు తగినంత దూరంలో ఉండాలని, మరి దగ్గరగా మరి దూరంగా ఉండరాదని తెలిపారు. కంటి చూపులు కొంత దిగువన మానిటర్ ఉండేలా చూసుకోవాలన్నారు. గదిలో కాంతి సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని, ఏకధాటిగా కంప్యూటర్ చూడకుండా కంటికి విరామం తప్పనిసరి ఇవ్వాలని తెలిపారు. అందుకే ప్రతి 20 నిమిషాలు-20 సెకండ్లు-20 అడుగుల దూరం చూస్తూ -20 సార్లు కంటి రెప్పలు ఆర్పాలని తెలిపారు. తరచుగా కృత్రిమ కన్నీటి చుక్కల మందులు డాక్టర్ సలహాలతో వాడుకోవాలని తెలిపారు. కావున కంప్యూటర్ను వినియోగించే వారు ఎవరైనా సరే కంటి పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే గుర్తించితే కంటిని కాపాడుకోగలమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు