- Advertisement -
విశాలాంధ్ర కొలిమిగుండ్ల … సిపిఐ రాష్త్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు ఈ నెల 27 వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఆయన కొలిమిగుండ్ల మండలం పరిధిలోని బెలూం లో సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా తరగతులకు హాజరవుతున్నారన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కార్యకర్తలకు మార్గనిర్దేశం వంటి అంశాలపై ఈ శిక్షణ తరగతుల్లో ఈశ్వరయ్య మాట్లాడుతారు.


