పలువురికి సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది అని తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనని తెలుగుదేశం పార్టీ పట్టణ పరిశీలకులు రంగేపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ సూచనలు మేరకు గాంధీనగర్ సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పట్టణ పార్టీ పరిశీలకులు రంగేపల్లి వెంకటరమణ హాజరు కావడం జరిగింది. పట్టణంలోని 40 వార్డులలో ఉన్నటువంటి వార్డుల అధ్యక్షులు వార్డు కమిటీ మెంబర్లు, కస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, సెక్షన్ ఇన్చార్జిలు తదితర వారితో సమావేశాన్ని నిర్వహించారు. తదుపరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ 40 వార్డులకు గాను వార్డు కమిటీలను పట్టణ కమిటీలను పట్టణ అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, వార్డులలో కష్టపడి పనిచేసిన వారికి వార్డు కమిటీలలో పదవులకు ఎంపిక చేసి తగిన గుర్తింపుని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తదుపరి నియోజకవర్గంలోని ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ఏడుగురికి రూ.4,60,656 చెక్కులను కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పరిటాల శ్రీరామ్, ఆరోగ్యశాఖ మంత్రి కి కృతజ్ఞతలను తెలియజేశారు.
ధర్మవరం నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది
RELATED ARTICLES