Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ఆర్డిఓ వికలాంగ పౌరుని సమస్యపై ప్రత్యక్ష స్పందన

ధర్మవరం ఆర్డిఓ వికలాంగ పౌరుని సమస్యపై ప్రత్యక్ష స్పందన

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డివిజన్ పపరిధిలోని చేన్నేకొత్తపల్లి మండలానికి చెందిన బసం పల్లి గ్రామ నివాసి తిమ్మశెట్టి అంజినేయులు భూమి సమస్యపై ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో జరుగుతున్న ప్రజా పరిష్కార వేదికలో తన సమస్యను తెలియజేయాలనుకున్నారు. అయితే ఆయన వికలాంగుడు అవ్వడంతో కార్యాలయం లోపలికి రాలేని పరిస్తితి ఈ విషయాన్ని గమనించిన ఆర్డీవో మహేష్ అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి, అంజినేయులును స్వయంగా కలిసి ఆయన వద్దే ఆర్జీ స్వీకరించారు. ఆయన భూమి సమస్యను స్వయంగా తెలుసుకుని, త్వరితగతిన పరిష్కారం చూపిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు ఆంజనేయులు ఆర్డిఓకు కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ సంఘటన ప్రభుత్వ అధికారుల ప్రజాసేవాపట్ల నిబద్ధతకు గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు