Monday, January 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేవాలయాలకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు వితరణ..

దేవాలయాలకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు వితరణ..

యువర్స్ ఫౌండేషన్ సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యువర్స్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు దేవాలయాలకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర, వ్యవస్థాపకులు పోలా ప్రభాకర్లు మాట్లాడుతూ భువనగిరి క్షేత్రం ఈశ్వరయ్య స్వామి, దాతలు వంకదారి సుజాతమ్మ జ్ఞాపకార్థం వీరి భర్త రామచంద్రగుప్త, కుమార్తెలు నీరజా దేవి షర్మిళాదేవి హేలాసా దేవి సహకారంతో హంపాపురం ఆంజనేయస్వామి క్షేత్రం ఉత్తర ద్వారం కి 25వేల రూపాయలు వాటర్ ట్యాంక్ ను, ఇందిరమ్మ కాలనీ అయ్యప్ప స్వామికి, ఆంజనేయ స్వామి ఆలయానికి, ధర్మవరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమునకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు వితరణ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వారు యువర్స్ ఫౌండేషన్ సంస్థ వారికి, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సత్రశాల మల్లికార్జున, జయంతి వినోద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు