ముఖ్య అతిథులు
విశాలాంధ్ర ధర్మవరం;; రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని ముఖ్య అతిథులు అయిన డాక్టర్ నరసింహులు, డాక్టర్ వైష్ణవి ,రోటరీ క్లబ్ నరేందర్ రెడ్డి, లాయర్ సుమలత, కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రజని ట్రస్టు, రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో కన్నా వెంకటేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 50 మంది రక్తదానం చేయడం జరిగిందని, వారందరికీ కృతజ్ఞతలను తెలుపుతూ మెడల్స్, ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. తదుపరి ముఖ్య అతిథులను ట్రస్ట్ వారు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జయరామిరెడ్డి ,శ్రీధర్, జయప్రకాష్, ఉదయ్ కుమార్, నాగరాజు, శివకుమార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుంది..
RELATED ARTICLES