విశాలాంధ్ర ధర్మవరం;; డివిజన్ పరిధిలోని రాప్తాడు మండలం ప్రసన్నాయన పల్లి వద్ద నారాయణ అనే వృద్ధుడు (82) రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా ఓ రైలు ఢీకొనగా, వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ధర్మవరం జిఆర్పి రైల్వే పోలీసులు తెలిపారు. తదుపరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని వారు తెలిపారు.
పావురాల పందెం విషయంపై ఘర్షణ;; పట్టణంలోని సత్యసాయి నగర్ లో ఇరువర్గాలు పావురాల పందెం విషయంలో ఘర్షణ పడి రాళ్ల దాడికి దిగారు. ఇరు వర్గాల ఘర్షణ పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ఆదినారాయణ పందెం పావురం సమయం గురించి యోగానంద్ యువకుడు హర్షకు సమాచారం ఇవ్వడం జరిగిందని, ఈ విషయం హర్ష ద్వారా తెలుసుకున్న ఆదినారాయణ యోగానందను ప్రశ్నించడంతో, అనుకోకుండా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని, ఒక వర్గానికి చెందిన యోగానంద్, విజయకుమార్, మరో వర్గానికి చెందిన నరేష్, ఆదినారాయణ పై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ తెలిపారు.