Thursday, January 16, 2025
Homeఆంధ్రప్రదేశ్సజావుగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు.. ఆర్డీవో మహేష్

సజావుగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 44 నీటి సంఘాలకు ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని ఆర్డిఓ మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 44 నీటి సంఘాలలో 318 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని 318 కి గాను 308 ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడ్డారని, 09 ప్రాదేశిక నియోజకవర్గ లా సభ్యులు క్లియర్ వేకెన్సీ గా డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని 44 నీటి సంఘాలకు అనగా ధర్మవరం- 8, బత్తలపల్లి-2, రామగిరి-6 తాడిమర్రి-1, ముదిగుబ్బ-11, చెన్నై కొత్తపల్లి-9, కనగానపల్లి-7 మొత్తం 44 లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు