Friday, June 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంవిశాలాంధ్ర వార్తకు స్పందించిన విద్యుత్ అధికారులు దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం

విశాలాంధ్ర వార్తకు స్పందించిన విద్యుత్ అధికారులు దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం

ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు

విశాలాంధ్ర -శింగనమల (పుట్లూరు) పుట్లూరు మండలం నారాయణరెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో నెలకొన్న విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీటీ రామాంజనేయులు విశాలాంధ్ర ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ప్రమాదాలు నివారించండి అనే శీర్షికన 1వ తేదీ ఆదివారం విశాలాంధ్ర ప్రచురించడంతో స్పందించిన విద్యుత్ అధికారులు కొత్త స్తంభాలను నాటి వైర్లను పైకి లాగి దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించారని రామాంజనేయులు తెలిపారు, సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు ఏపీ కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీటీ రామాంజనేయులు నారాయణరెడ్డిపల్లి గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు బి. చిన్ని కృష్ణుడు యాదవ్ ,నాయకులు కే నాగ పుల్లయ్య,కె.ఓబులేసు గ్రామస్తులు చెన్రాయుడు, గోపాలు, రాజకీయ నాగేంద్ర, చిన్నోడు,రాజు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు