Wednesday, June 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఒక్కరోజు సమయమును ఇవ్వాలని కోరినా కూడా, ఇంటిముందు జెసిపితో తొలగింపు..

ఒక్కరోజు సమయమును ఇవ్వాలని కోరినా కూడా, ఇంటిముందు జెసిపితో తొలగింపు..

ఇంటి బాధితుడు జయచంద్ర ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పార్థసారధి నగర్ లో జయచంద్ర తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. మున్సిపల్ ఆఫీస్ కాలువలు తవ్వే నిమిత్తం, మా ఇంటి వద్దకు వచ్చి సమయం ఇవ్వాలని కోరినా కూడా జెసిపి తో తొలగించడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితుడు జయచంద్ర వాపోయాడు. ఈ సందర్భంగా జై చంద్ర మాట్లాడుతూ మా ఇంటిలో నా కోడలు నిండు గర్భిణీ అని, మా తల్లి గుండె జబ్బు మనిషి అని చెప్పినా కూడా, సచివాలయ ఉద్యోగి సంధ్య ఏ మాత్రం పట్టించుకోకుండా, జెసిబి తో ఇంటి ముందు, కాలువ పైన ఉండు బండను తొలగిస్తూ పెద్ద గుంతను తీయడం జరిగిందన్నారు. మరి మా కుటుంబ సభ్యులు బయటకు ఎలా వెళ్లాలో తెలియక, తమ ఆవేదన వ్యక్తం చేసినా కూడా నిర్లక్ష్యంతో సచివాలయ ఉద్యోగిని అక్రమంగా తొలగించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. మా ఇంటి ముందు ఉన్న ర్యాంపును కూడా ధ్వంసం చేసి హడావుడి సృష్టించింది అని తెలిపారు. కనీసం మున్సిపల్ అధికారులు ఇంటి ముందు ఏది తొలగించాలన్న,, ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా!! మరి దౌర్జన్యంతో ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని బాధని వ్యక్తం చేశారు. తాను ప్రజా ప్రతినిధులను కలిసి న్యాయం కోసం పోరాడుతానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు