- Advertisement -
విశాలాంధ్ర నందిగామ :-స్థానిక చెరువు బజార్ సాయి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా మందిర 24 వార్షికోత్సవ సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు మంగళవారం నిర్వహించారు ఆలయ ధర్మకర్త కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ కాకడ హారతి గణపతి పూజ అఖండ ప్రతిష్టాపన మండపారాధన, పంచామృత అభిషేకాలు సామూహిక అభిషేకాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ గణపతి నవగ్రహ చండీ సహిత రుద్రహోమాది క్రతువులు వేదొక్తంగా జరిగాయి మంగళవారం సాయంత్రం షిరిడి సాయినాథ్ నామస్మరణ నడుమ పల్లకి సేవ, గ్రామోత్సవం ఘనంగా జరిగింది…


