జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : యోగా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జిల్లాస్థాయి యోగా కాంపిటీషన్స్ ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జిల్లాస్థాయి యోగా కాంపిటీషన్స్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతోందన్నారు. యోగా ఆసనాలు, యోగా ఎస్సే, పోస్టర్లు, యోగా పెయింటింగ్, క్విజ్, గ్రూప్ యోగా, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, సాంగ్, తదితర విభాగాలలో యోగాపై కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని, ఇందులో జూనియర్, యువత, సీనియర్స్ ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
యోగా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
RELATED ARTICLES