Monday, June 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు యోగాను అలవరచుకోవాలి

ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు యోగాను అలవరచుకోవాలి

జిల్లా జైల్ సూపరిండెంట్ -రహమాన్
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా జైల్ ప్రాంగణం రెడ్డిపల్లి లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జైల్ సూపరిండెంట్ రహమాన్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ కార్యక్రమాన్నిప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా జైల్ లో ఉన్నవారు అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగ చేసుకొని శారీరక ,మానసిక ఆరోగ్యం పొందాలని కోరారు –
ఈ కార్యక్రమంలో ,ముఖ్య అతిథిగా పాల్గొన్న డి యం హెచ్ ఓ . యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డా .ఈబి దేవి , పాల్గొనగా ,జైల్ సూపరిండెంట్ రహమాన్ ,ఇతర జైల్ అధికారులు , వసంతకుమార్ నాగరాజ్ ,హరీష్ ,చంద్రమోహన్ ,రవికుమార్ ,ఆయుష్ అధికారులు డా.రామ్ కుమార్, డా.లాల్యా నాయక్ డెమో త్యాగరాజ్ ,డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ , వివేకానంద యోగ కేంద్రము ,ఈస్సా ఫౌండేషన్ వారి సిబ్బంది, పాల్గొని యోగాసనాలు చేశారు . ఈ సందర్భంగా డి యం హెచ్ ఓ , యోగాంధ్ర నోడల్ అధికారి డా ఈ బి దేవి మాట్లాడుతు… జైల్ అధికారులు సిబ్బంది , ఖైదీలు అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమని , సమాజం లో వున్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం తో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని ఒక నెల రోజులు పాటు నిర్వహించి ప్రజలందరికి నిత్య జీవితం లో యోగ ఒక భాగం చేయాలని ,ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అములు చేయుచున్నావని , ప్రజలందరూ యోగ చేయడం వల్ల ఎంతటి రోగాలనైనా మన శరీరం తట్టుకుంటుందని, మనమందరం ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాన్ని పోషించుకోగల మనో ధైర్యం, సంకల్పం ఇలాంటి యోగాతోనే సాధ్యమవుతుందన్నారు అందరూ యోగాను సాధన చేయాలని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ,జిల్లా లో యోగ కార్యక్రమము విజయవంతంగా జరగడానికి మార్గదర్శం చేస్తున్న జిల్లా కలెక్టర్ డా వినోద్ కుమార్ వి .ఐ ఏ ఎస్ , జైల్ లో జరగడానికి సహకరించిన సూపరిండెంట్ రహమాన్ కు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు