Thursday, June 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి"వెన్నుపోటు దినం" పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి

“వెన్నుపోటు దినం” పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల నాలుగవ తేదీన నిర్వహించబడే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని సంబంధించిన కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తోపాటు వైఎస్ఆర్సిపి నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తారీఖున జరగబోయే “వెన్నుపోటు దినోత్సవ” కార్యక్రమాన్ని ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది అని ఆరోపించారు. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది అని తెలుపుతూ ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు అని తెలిపారు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు అని తెలిపారు.
అధికారంలో వచ్చిన తొలిరోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌ది అని తెలిపారు. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు అని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై ఆనాడే వైయస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికంను నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు అని తెలిపారు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అని, తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు