ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా సూపర్ సిక్స్ అనే కార్యక్రమం కింద ముఖ్యమైన పథకాల అమలుకు రంగం సిద్ధం చేసింది. మహిళలపై ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు,వారి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అందించనున్నారు.
ఈ పథకానికి స్త్రీ శక్తిఃఅనే పేరు పెట్టారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి స్త్రీ శక్తి పేరుతో టికెట్ల రూపకల్పన, సాఫ్ట్వేర్లో మార్పులు, ఉద్యోగులకు శిక్షణ వంటి కార్యక్రమాలు ముందడుగు వేస్తున్నాయి.
స్త్రీ శక్తిఁ టికెట్లపై ప్రత్యేక ముద్రణ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేయబోయే నమూనా టికెట్లపై ఃస్త్రీ శక్తిః అనే గుర్తింపు ముద్రించనున్నారు. ఈ టికెట్లు ఉచిత ప్రయాణానికి సంబంధించినవని స్పష్టంగా తెలియజేస్తూ, వాటిని ఁజీరో ఫేర్ టికెట్ఁ అనే పేరు మీద జారీ చేయనున్నారు.టికెట్పై ప్రయాణ ఛార్జీలు, ప్రభుత్వ రాయితీ వివరాలు తదితర సమాచారం స్పష్టంగా ముద్రిస్తారని అధికారులు వెల్లడించారు.దీనివల్ల ప్రయాణించేప్పుడు మహిళలకు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి స్పష్టత కలుగుతుందని చెబుతున్నారు.
ఈ పథకం అమలులోకి రావడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపోల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు.జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో శిక్షణ కార్యక్రమాలు ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి.టికెట్ల జారీ వేగంగా జరగాలన్న ఉద్దేశంతో, టికెట్ ఇష్యూ మిషన్లు , యుటీఎస్ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు ఇప్పటికే పూర్తయ్యాయి.మహిళలు బస్సులో ఎక్కిన వెంటనే టికెట్ పొందేలా వ్యవస్థను సాంకేతికంగా మెరుగుపరిచారు.స్త్రీ శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ప్రయాణించే మహిళలకు,ఉద్యోగాల కోసం, వైద్యసేవల నిమిత్తం బస్సుల్లో ప్రయాణించేవారికి అనేక రకాలుగా లాభాలు కలగనున్నాయి. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు, స్వేచ్ఛతో ప్రయాణించేందుకు ఎంతో దోహదం చేస్తుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి.


