- Advertisement -
అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. రేపు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నిమజ్జన ఉత్సవాలను వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు సౌలభ్యం కలగనుంది.


