విశాలాంధ్ర -ధర్మవరం; లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమవుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టబోయేది ఆడబిడ్డ? లేక మగ బిడ్డ? అని తెలుసుకోవడం చట్టరీత్యా నేర మవుతుందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన వైద్యునికి చట్ట ప్రకారం మొదటి తప్పుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా తో పాటు భారత వైద్యమండలి నందు వారి వైద్య ధ్రువీకరణ పత్రం ఐదు సంవత్సరాల వరకు తొలగించబడుతుందని తెలిపారు. తదుపరి లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లయితే ఐదు సంవత్సరములు జైలు శిక్ష, 50వేల రూపాయల జరిమానా తో పాటు భారత వైద్యమండలి నందు వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా తొలగించబడుతుందని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేయమని అడిగినా, ప్రోత్సహించిన, మొదటి తప్పక మూడు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 50 వేల రూపాయల జరిమానా ఉంటుందన్నారు. తదుపరి ఉల్లంఘనకు పాల్పడినట్లయితే ఐదు సంవత్సరముల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు, చేయించుకున్న వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్ష అర్హులు అవుతారని తెలిపారు. కావున ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు లింగ నిర్ధారణ చేయకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. పట్టణంలో మా ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు పై విషయాలు బయటపడితే తప్పక కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం .. ఆర్డీవో మహేష్
RELATED ARTICLES