Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర

రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర

- Advertisement -

బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,06,980కి చేరింది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడటం కూడా పసిడి ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ రెండు ప్రధాన కారణాలతో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి.ప్రధాన నగరాల్లో ధరల విషయానికొస్తే, హైదరాబాద్ మరియు విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,06,980గా ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 98,060గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,07,130కి, 22 క్యారెట్ల పసిడి రూ. 98,210కి చేరింది.మరోవైపు, వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై సుమారు వంద రూపాయల మేర ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 1, 37, 100గా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు