దేశంలో బంగారం ప్రియులకు ఊరట తెచ్చే వార్త వచ్చేసింది. ఇటీవల లక్షల 19 వేలకు చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.2025 సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధరలో రూ.930 తగ్గుదల నమోదై, ఇది రూ.1,14,430కి చేరింది.అదే సమయంలో 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ.1,04,890గా ఉంది.వేరే నగరాల్లో కూడా వెండి ధరల్లో స్థిరత్వం కనిపిస్తోంది.హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే మారకుండా రూ.1,49,900 వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా కేజీ వెండి ధర రూ.1,39,900గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ బంగారం ధరలు
ముంబై: రూ.1,14,430, రూ. 1,04,890
చెన్నై: రూ.1,14,650, రూ. 1,05,090
కోల్కతా: రూ.1,14,430, రూ. 1,04,890
బెంగళూరు: రూ.1,14,430, రూ. 1,04,890
ఢిల్లీ: రూ.1,14,580, రూ. 1,05,040
హైదరాబాద్, విజయవాడలో రూ.1,14,430, రూ. 1,04,890
పూణేలో రూ.1,14,430, రూ. 1,04,890
ఈ ధరలు ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాల్లో సమానంగా ఉన్నాయి. చెన్నైలో కొంచెం ఎక్కువగా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు కిలోకు
వెంటి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్, విజయవాడ: రూ.1,49,900
ఢిల్లీ: రూ.1,39,900 ముంబై: రూ.1,39,900
చెన్నై: రూ.1,49,900 కోల్కతా: రూ.1,39,900
బెంగళూరు: రూ.1,39,900
పూణేలో: రూ.1,39,900
వడోదరలో: రూ.1,39,900
వెండి ధరలు దక్షిణాది నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాదిలో తక్కువ. ఈ మార్పులు స్థానిక మార్కెట్ డిమాండ్పై ఆధారపడి మారుతుంటాయి.


