Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన గురజాడ అప్పారావు వర్ధంతి

ఘనంగా జరిగిన గురజాడ అప్పారావు వర్ధంతి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రముఖ తెలుగు రచయిత గురజాడ వర్ధంతి వేడుకలను పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముఖ్య అతిథులుగా గల ఐద్వా జిల్లా కార్యదర్శి నాగమణి, కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. తదుపరి విద్యార్థులతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని,గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో కన్యాశుల్కం పూర్ణమ్మ ,దిద్దుబాటు ఇలా అనేక రచనలు చేశారన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తన రచనల ద్వారా మహాద్భుతంగా రాసిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు కనుమ దామోదర్, హరి కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు