Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం .. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ, అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై సజ్జల భార్గవ రెడ్డి తదితరులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు