Thursday, January 16, 2025
Homeజిల్లాలుపార్వతీపురం మన్యండిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన హేమలత

డిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన హేమలత

విశాలాంధ్ర, పార్వతీపురం : జిల్లా రెవెన్యూ అధికారిగా కె. హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ను, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబికకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంలు అందజేశారు.హేమలత గతంలో పార్వతీపురం, పాలకొండ, విజయనగరం రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పార్వతీపురం రిటర్నింగ్ అధికారిగా చక్కగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. హేమలత జిల్లా రెవెన్యూ అధికారిగా నియామకం పట్ల జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. డిఆర్ఓ ను పలువురు రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ఉద్యోగులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు