Homeతెలంగాణస్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల

స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను ఇవాళ‌ విడుదల చేసింది. పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలను ఆర్థికంగా శక్తిమంతం చేయడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే ఈ నిధుల విడుదల ముఖ్య ఉద్దేశమని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత ఃఅన్-టైడ్ గ్రాంట్ః కింద రూ. 247.94 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీలకు చేరనున్నాయి. అన్-టైడ్ నిధులు కావడం వల్ల స్థానిక అవసరాలను బట్టి ఏ అభివృద్ధి పనులకైనా గ్రామ పంచాయతీలు ఈ నిధులను స్వేచ్ఛగా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.ఇక ఇతర రాష్ట్రాల విషయానికొస్తే, రాజస్థాన్‌కు రెండో విడత అన్-టైడ్ గ్రాంట్‌గా రూ. 315.61 కోట్లు కేటాయించారు. ఉత్తరాఖండ్‌కు రెండో విడతగా రూ. 91.31 కోట్లు మంజూరు చేశారు. వీటితో పాటు గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన నిధులను కూడా కేంద్రం ఇప్పుడు విడుదల చేసింది. మహారాష్ట్రకు గత ఆర్థిక సంవత్సరాలకు (2024-25, 2025-26) సంబంధించి నిలిచిపోయిన టైడ్, అన్-టైడ్ గ్రాంట్ల కింద వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నిధులు అక్కడి జిల్లా పరిషత్‌లు, బ్లాక్ పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు ప్రయోజనం చేకూరుస్తాయి.

అలాగే, మేఘాలయకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అన్-టైడ్ గ్రాంట్‌తో పాటు టైడ్ గ్రాంట్లను కూడా కేంద్రం విడుదల చేసింది. టైడ్ గ్రాంట్లను తాగునీరు, పారిశుద్ధ్యం వంటి నిర్దిష్ట పనులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, అన్-టైడ్ గ్రాంట్లను స్థానిక ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయవచ్చు. ఈ నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు