విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథులుగా మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువు బాబు బాలాజీ ఆధ్వర్యంలో 15 మంది శిష్య బృందం యోగా నాట్యమును ప్రదర్శించారు. ఈ నాట్య ప్రదర్శనలో యోగా వల్ల ఉపయోగాలు, పాటలోనే యోగ వివిధ భంగిమలు చేసిన వైనం మంత్రి సత్య కుమార్ యాదవ్, చిలక మధుసూదన్ రెడ్డి,అధికారులతో పాటు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టరు, జాయింట్ కలెక్టర్, మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తో ప్రశంసలు అందుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నాట్య రూపంలో ప్రదర్శించడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలుపుతూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రామలాలిత్యా వారి శిష్య బృందం పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన.. నాట్య గురువు బాబు బాలాజీ
RELATED ARTICLES